తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు, హీరో అయిన అడవి శేష్ గురించి మనందరికి తెలిసిందే.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నాడు.
ఇకపోతే అడవి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మేజర్.ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిదిందే.ఈ సినిమాను మహేశ్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించారు.
ఇకపోతే జూన్ 3న విడుదల కావున్న విషయం తెలిసిందే.
ఇటీవలే మే 9న మేజర్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన విషయం తేలిసిందే.
ఆ ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.ఇది ఇలా ఉంటే సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.
ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా అడివి శేష్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు.ఇంటర్వ్యూ లో భాగంగా అడవి శేష్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నా అసలు పేరు అడివి సన్నీ కృష్ణ.కానీ అమెరికాలో ఉన్నప్పుడు అందరూ సన్నీలియోన్ అని ఆటపట్టిస్తుండటంతో అడివి శేష్గా మారాను అని తెలిపారు.
అమెరికాలో హీరోగా ఎందుకు ప్రయత్నించలేదన్న ప్రశ్నకు అడివి శేష్ స్పందిస్తూ.అక్కడ భారతీయులకు టెర్రరిస్ట్, పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి.ఇలాంటి పాత్రలే ఇచ్చేవారు.ఇండియన్ హీరో అక్కడ హీరో అవ్వలేడు అని తెలిపాడు అడివి శేష్.అలాగే మాట్లాడుతూ చందమామ సినిమాలో ఒరిజినల్ హీరో తానే అని, హీరో నవదీప్ స్థానంలో హీరోగా తాను ఉండాల్సింది అని తెలిపాడు.అయితే రెండు రోజుల షూటింగ్ తర్వాత సినిమా క్యాన్సిల్ అయిందని,ఆ తర్వాత సొంతంలో పెద్ద రోల్ ఉందన్నారు.
కట్ చేస్తే సినిమాలో ఐదు సెకన్ లు ఉన్నాను అంతే అని చెప్పుకొచ్చాడు.మేజర్ సినిమా గురించి చెప్తూ అందరికీ సందీప్ ఉన్నికృష్ణన్ ఎలా చనిపోయాడో తెలుసు, కానీ ఎలా బతికాడనేది తెలియదని, అదే తమ సినిమా తెలియజేస్తుందన్నాడు.