డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల్లో బాగా బ్యాలెన్స్ ఉన్నవారు ఎలాగోలా లాకొచ్చెస్తున్నారు కాని, వాటిని వాడని పేద ప్రజలు, ప్రతీ అవసరాన్ని క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ తో తీర్చుకోలేని మధ్యతరగతి ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ATM ఎక్కడో ఓ చోట తెరిచి ఉంటుంది.
అక్కడికి వెళితే గంటలకొద్ది క్యూలో నిలిచోవాలి.ఇక బ్యాంక్ కి వెళితే నరకమే.
సినిమాతారలను చూడ్డానికి వచ్చినట్లు ఎగబడుతున్నారు జనాలు.అటో ఇటో చేసి ATMకి వెళితే అందులో కొత్తనోట్లు ఉండట్లేదు.
కేవలం 100 రూపాయల నోట్లే.అవి కూడా అందరికీ అందట్లేదు.
మరి ఈ కొత్త నోట్లు ATM లోకి ఇంకా ఎందుకు రానట్లు? సమస్య ఏంటి అన్నట్లు? తెలుసుకుంటే చిన్న సమస్యేమి కాదు ఇది, పెద్దదే.పాత నోట్లకి, విడుదల చేసిన కొత్త నోట్లకి సైజులో తేడా ఉంది.
కొత్త నోట్ల సైజు 26% తక్కువగా ఉందంట.అందుకే ప్రస్తుతం ఉన్న ATM వాటిని విడుదల చేయలేకపోతున్నాయి.
దేశవ్యాప్తంగా 2 లక్షల ATMs ని ఇప్పుడు కొత్త నోట్లకి తగ్గట్టుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో పడ్డారు.అందుకే ఈ ఆలస్యం జరుగుతోందని Cash Logistics Association of India అధ్యక్షుడు రితూరాజ్ సిన్హా చెబుతున్నారు.
ఇదే నిజమైతే, దేశంలో ఉన్న ATMs అన్ని ఎప్పుడు రెడీ కావాలి, కొత్త నోట్లు ఇబ్బంది లేకుండా ఎప్పుడు దొరకాలి, ప్రజల కష్టాలు ఎప్పుడు తీరాలి.