భార్యా భర్తలు అన్న తరువాత చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి.ఆ విషయానికి వస్తే తిట్టుకోకుండా కొట్టుకోకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ అయితే ఒక మహిళా తన భర్తతో గొడవపడి విడిపోయి అందరిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది అయితే ఈ క్రమంలో ఒక ఫ్యాకటరీలో పని కి చేరింది అయితే తన అవసరాలకి కొంత డబ్బుని అప్పుడప్పుడు తన స్నేహితురాలిని అడిగేది అయితే
ఆమె అవసరం గమనించిన ఆమె ఆ మహిళతో సన్నిహితంగా ఉంటూనే ఆమెకి మాయమాటలు చెప్తూ వ్యభిచార కూపంలోకి దింపింది.వివరాలలోకి వెళ్తే… ఒంగోలు మండలానికి చెందిన ఓ యువతిని మద్దిపాడు మండలానికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేశారు.దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో యువతి పుట్టింటికి చేరింది.
అప్పటి నుంచి ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి.గ్రోత్సెంటర్లోని ఓ కుర్చీల ఫ్యాక్టరీలో కూలి పనికి చేరింది.
అయితే అక్కడ పరిచయం అయిన మహిళ ఎన్నాళ్ళు ఇలా ఉంటావ్ మా అక్క దగ్గరకి వస్తే ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తుంది కానీ
వ్యభిచారం చేయాలని ఆమెని ప్రోత్సహించింది డబ్బుకోసం మన కష్టాలు పోగొట్టుకోవడం కోసం ఇలా చేయడంలో తప్పులేదని ఆమెని ఎలాగైనా ఒప్పించింది .ఒంగోలు తీసుకుని వెళ్లి ఆమెని వ్యభిచార గృహానికి అమ్మేసింది.అయితే ఈ విషయం తెలుసుకున భాదితురాలి తల్లి ఆమెని అప్పగించాలని డిమాండ్ చేసినా ఫలితం లేకపోయింది దాంతో పోలీసులకి సంచారం అందించిన ఆమె వారి ద్వారా ఆమెని విడిపించింది.అయితే ఆమెని బలవంతంగా ఈ వ్యభిచారం లోకి దింపిన రామాదేవిని మరికొంత మందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు.