టాలీవుడ్ సినీ నటి, రాజకీయవేత్త అయిన హేమ మాలిని గురించి మనందరికీ తెలిసిందే.అయితే ఈ తరం ప్రేక్షకులకు ఈమె గురించి పెద్దగా తెలియక పోవచ్చు కానీ అప్పటివారికి అయితే ఈమె బాగా సుపరిచితమే.1970 నాటి కాలంలో ఈమె తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.అప్పట్లో సూపర్ హిట్ సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అంతే కాకుండా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను తన కంటూ ఒక చెరగని ముద్ర వేసుకుంది.తాజాగా హేమమాలిని తన తల్లి జయ చక్రవర్తి పుట్టిన రోజు సందర్భంగా ఆమెను తలచుకుంటూ, తన తల్లి ఆమె దిగిన పాత ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలను షేర్ చేస్తూ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ ఫోటోలకు సమయం ఎంత వేగంగా కదులుతుందో అర్థం కావడం లేదు.
ఇది నా జీవితంలో మరో రోజులాగా మాత్రమే ఉంది.ఈ ఫోటోలను చూస్తూ ఉంటే మొన్న రోజుకి మూడు షిఫ్టులు చేస్తూ.
నిన్ననే అమ్మతో కలిసి షూటింగ్ డేట్స్ సర్దుబాటు చేసేందుకు పనిలో నిమగ్నం అయినట్టు ఉంది అని పోస్టులు తెలిపింది.అంతేకాకుండా ఆమె లేకుండా అప్పటివరకు ఏ పని చేసుకోలేదు.
ప్రస్తుతం ఆమె లేకుండానే నా పనులు చేసుకుంటున్నాను.జీవితం ముందుకు సాగాలి కానీ జీవించి ఉన్నంతకాలం జ్ఞాపకాలు నిలిచిపోతాయి అంటూ ఆమె ఎమోషనల్ గా ఈ పోస్ట్ని షేర్ చేసింది.
మరొక పోస్టులో.అమ్మ కుటుంబానికి బలంగా ఉండటమే కాకుండా నిజమైన రాణిలా వ్యవహరించింది.ఆమె తన మనవళ్లు మనవరాళ్లు అందరినీ సమానంగా ప్రేమించడమే కాకుండా వారిని దగ్గరగా ఉంచుకోవడానికి ఇష్టపడేది అని ఆమె తెలిపింది.వారందరూ కూడా వారి గ్రాండ్ మదర్ ని అంబా అని పిలుస్తూ ఆ పుట్టిన రోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.
ఇవి ఆ రోజు తీసిన స్పెషల్ ఫోటోలు అంటూ పోస్ట్ చేసింది హేమమాలిని.హేమమాలిని చేసిన పోస్ట్ అండ్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ పోస్ట్ పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.