కుమారి 21ఎఫ్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.కొన్ని పర్వాలేదు అనిపించుకోగా మరి కొన్ని నిరాశ పర్చాయి.
హెబ్బా పటేల్ ఈమద్య కాలంలో సక్సెస్ లేక ఢీలా పడిపోయింది.ఆఫర్లు కూడా చాలా తగ్గాయి.
వచ్చిన ప్రతి ఆఫర్ను వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తుంది.కాని ఆమెకు మాత్రం దక్కుతున్నది కొద్ది మొత్తమే.
తాజాగా ఈమె రాజ్ తరుణ్ కు జోడీగా ఒక సినిమాలో నటించింది.ఆ సినిమా విడుదలకు రెడీ అయ్యింది.
లాక్ డౌన్ కు ముందే సినిమా విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా వల్ల ఆగిపోయింది.సినిమా విడుదల విషయంలో నెలకొన్న సస్పెన్స్ తొలగి పోయింది.
సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రకటించారు.ఆ సినిమా తర్వాత మళ్లీ బిజీ అవుతానేమో అంటూ హెబ్బా ఎదురు చూస్తుంది.
ఇలాంటి సమయంలో ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో వైరల్ అవుతోంది.
ఒక సాదారణ చీర కట్టుకుని చాలా సింపుల్ లుక్ తో హెబ్బా కనిపించింది.
లావు అవ్వడంతో పాటు నార్మల్గా ఉండటంతో హెబ్బాను ఆంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.హెబ్బాను ఇలా చూస్తుంటే ఇంకా హీరోయిన్గా ఆమె రాణించడం కష్టమే అనిపిస్తుంది.
ఆమె లుక్ చాలా నాచురల్గా ఉంది బాగుంది అంటున్నప్పటికి హీరోయిన్గా ఆమె మళ్లీ కనిపించక పోవచ్చు అనేందుకు ఈ ఫొటో ఉదాహరణగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.లావుగా ఉన్న వారు ఎక్స్ పోజ్ చేసేందుకు ప్రయత్నిస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది.
మరి హెబ్బా వరుసగా సినిమాలు చేస్తున్నా ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో ఆమె మళ్లీ బిజీ అవ్వాలంటే ఏదైనా అద్బుతం జరగాలంటున్నారు.ఆ అద్బుతం హెబ్బా కెరీర్లో జరిగి స్టార్ హీరోయిన్గా మారుతుందా అనేది చూడాలి.
ప్రస్తుతానికి అయితే చీర కట్టులో చాలా సింపుల్గా అబ్బ హెబ్బా అన్నట్లుగా మాత్రం ఉంది.