గత సంవత్సరం ప్రారంభం అయిన తెలుగు బిగ్బాస్ సూపర్ హిట్ అయ్యింది.అందుకే ఈ సంవత్సరం రెండవ సీజన్ను భారీ అంచనాల నడుమ ప్రారంభించడం జరిగింది.
సీజన్ 2కు హోస్ట్గా నానిని ఎంపిక చేయడంతో పాటు, ఇంట్లో సభ్యుల ఎంపిక విషయంలో నిర్వాహకులు తప్పులో కాలేశారు.పెద్దగా గుర్తింపు లేని వారిని ఇంట్లోకి పంపించి విమర్శలపాలయ్యారు.
అయితే షో రెండవ వారం తర్వాత సీన్ మారిపోయింది.షోకు విపరీతమైన ఆధరణ దక్కుతుంది.
షోలో ప్రముఖ సెలబ్రెటీలు లేకున్నా కూడా షో రసవత్తరంగా సాగుతుంది.
ఈ సమయంలోనే రెండవ వైల్డ్ కార్డ్ గురించిన చర్చ జరుగుతుంది.
బిగ్బాస్ ప్రారంభం అయిన వారం రోజులకే నందినిని మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి పంపించడం జరిగింది.ఇక తాజాగా రెండవ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సమయం ఆసన్నమైంది.
మొత్తం మూడు లేదా నాలుగు వైల్డ్కార్డ్ ఎంట్రీలు ఉంటాయని అంతా భావిస్తున్నారు.ఈ సమయంలోనే రెండవ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈ వారంలో ఉండే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో ఫేమస్ అయిన హీరోయిన్ హెబ్బా పటేల్ను రెండవ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్బాస్ ఇంట్లోకి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.తెలుగులో హీరోయిన్గా మంచి గుర్తింపు దక్కించుకున్న హెబ్బా పటేల్ గత కొంత కాలంగా పెద్దగా సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది.ఈమె కేవలం ఒకే ఒక్క చిత్రంలో నటించింది.ఆ సినిమా కూడా విడుదలకు సిద్దం అయ్యింది.బిగ్బాస్లో ఎంట్రీ ఇవ్వడం వల్ల తనకు మళ్లీ హీరోయిన్గా అవకాశాలు వస్తాయనే నమ్మకంతో హెబ్బా ఉన్నట్లుగా తెలుస్తోంది.
వరుసగా చిత్రాల్లో నటించిన హెబ్బా పటేల్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకుంది.
అందుకే బిగ్బాస్ షోకు కొత్త కళ తీసుకు వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.అందుకే హెబ్బా పటేల్తో చర్చలు జరపడం జరిగింది.ఇప్పటికే ఒప్పంద పత్రంపై హెబ్బాతో సంతకాలు కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది.హెబ్బా పటేల్ ఎంట్రీతో బిగ్బాస్ మరింత జోరు పెంచుకునే అవకాశం ఉంది.
మొదటి సీజన్లో దీక్షా పంత్ను వైల్డ్ కార్డ్ ద్వారా పంపించడం జరిగింది.ఇక ఈ సీజన్లో హెబ్బా ఎంట్రీ ఇవ్వబోతుందనే విషయంపై స్టార్ మా నుండి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.