టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన “కుమారి 21ఎఫ్” చిత్రంలో పరిణితి చెందిన యువతి పాత్రలో నటిచినటువంటి హీరోయిన్ “హెబ్బా పటేల్” తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే వచ్చీ రావడంతోనే ఈ అమ్మడు మంచి హిట్ అందుకున్నప్పటికీ తాను నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఫెయిల్ అవ్వడం మరియు కథల విషయంలో కొంత మేర అవగాహన లోపించడం వంటి కారణాలతో ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేక పోతోంది.
దీంతో అడపాదడపా స్పెషల్ గీతాల్లో అప్పుడప్పుడూ కనిపిస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం హెబ్బా పటేల్ చేతిలో సినిమాలకు సంబంధించి కొత్త అవకాశాలు లేకపోవడంతో ఈ అమ్మడు వెబ్ సిరీస్ లలో నటించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
అంతేగాక ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థలు అయినటువంటి అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలతో ఇప్పటికే రెండు అడల్ట్ ఓరియంటెడ్ కంటెంట్ ఉన్నటువంటి వెబ్ సిరీస్లలో నటించేందుకు ఓకే చెప్పిందట.అయితే ఈ వెబ్ సిరీస్ లో హెబ్బా పటేల్ తన అందాలను ఆరబోయడంతో పాటు తన నటనను నిరూపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోందట.
అయితే ఇప్పటికే పలువురు నటీనటులు ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క వెబ్ సిరీస్ లలో నటిస్తూ రెండు చేతులా బాగానే సంపాదిస్తున్నారు.అందువల్లే హెబ్బా పటేల్ కూడా తనకు సినిమా అవకాశాలు వచ్చేంతవరకు వెబ్ సిరీస్ లలో నటించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అయితే ఈ అమ్మడు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో దాదాపుగా పది చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.అయినప్పటికీ అవకాశాలను మాత్రం దక్కించుకోలేకపోయింది.
అయితే ప్రస్తుతం ఈ అమ్మడు రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న “ఒరేయ్ బుజ్జిగా” అనే చిత్రంలో రెండో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా నటిస్తున్న “రెడ్” అనే చిత్రంలో ఓ స్పెషల్ గీతంలో నటించింది.
ఇటీవలే ఈ స్పెషల్ గీతానికి సంబంధించినటువంటి షూటింగ్ పని కూడా పూర్తయినట్లు సమాచారం.