కాజల్‌ను తప్పించిన కుమారి

మెగా హీరో వరుణ్‌ తేజ్‌, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో ఒక చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే.ప్రస్తుతం శ్రీనువైట్ల ఈ చిత్రం కోసం స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తోంది.

 Hebah Patel To Romance Varun Tej-TeluguStop.com

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేసినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.ఆ తర్వాత రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అంటూ కథనాలు వచ్చాయి.

తాజాగా ఈ చిత్రంకు హీరోయిన్‌గా హెబ్బా పటేల్‌ను ఎంపిక చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అధికారిక సమాచారం అందుతోంది.ఈ చిత్రంలో హీరోయిన్‌గా హెబ్బా పటేల్‌ను ఎంపిక చేసిన విషయాన్ని నిర్మాత ఠాగూర్‌ మధు తెలియజేశాడు.

‘కుమారి 21ఎఫ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హెబ్బా పటేల్‌ ప్రస్తుతం రాజ్‌ తరుణ్‌తో ఒక చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాలున్న ఈ మెగా మూవీలో హెబ్బాను ఎంపిక చేయడంతో ఈమెకు భవిష్యత్తులో మరిన్ని ఆఫర్లు రావడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు.

నటిగా మంచి గుర్తింపును కుమారి చిత్రంతో తెచ్చుకున్న హెబ్బా ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలతో మరింత సక్సెస్‌ అవ్వడం ఖాయం అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube