టాలీవుడ్ లో ఓ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి సంపత్ నంది.శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ అంటే సంపత్ నంది హోం ప్రొడక్షన్ లాంటిది.
ఆ బ్యానర్ లోనే ఏమైంది ఈవేళ సినిమాతో సంపత్ నంది దర్శకుడుగా పరిచయం అయ్యాడు.ఈ సినిమా తర్వాత బెంగాల్ టైగర్ సినిమా కూడా ఇదే బ్యానర్ లో సంపత్ చేశాడు.
ప్రస్తుతం గోపీచంద్ సిటీమార్ కూడా ఇదే బ్యానర్ లో తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే బ్యానర్ లో తన శిష్యులని కూడా దర్శకుడు సంపత్ పరిచయం చేసే పని పెట్టుకున్నాడు.
ఇందులో భాగంగా డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ కథతో ఓదెల రైల్వేస్టేషన్ అనే సినిమాని తెరక్కిస్తున్నారు.ఈ సినిమా ద్వారా అశోక్ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే సంపత్ నంది అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ ఇందులో హీరోయిన్ గా అవకాశం సొంతం చేసుకుంది.
టాలీవుడ్ లో యంగ్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్న హెబ్బాకి అవకాశాలు తగ్గిపోవడంతో వెబ్ సిరీస్ ల బాట పట్టింది. ఒరేయ్ బుజ్జిగా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించినా అది పూర్తి స్థాయి క్యారెక్టర్ కాదు.
అయితే ఒదేల రైల్వే స్టేషన్ సినిమాలో మాత్రం పల్లెటూరి అమ్మాయి పాత్రలో హెబ్బా పటేల్ కనిపించబోతుంది.ఇక ఈ సినిమా ద్వారా కన్నడంలో యంగ్ హీరోగా దయవిట్టు గమనిసి, 8ఎంఎం బుల్లెట్, ఇండియా వెర్సస్ ఇంగ్లాండ్, మాయబజార్ 2016, వంటి హిట్ చిత్రాలలో నటించి, కె.జి.ఎఫ్, మఫ్టీ, టగరు, గోధి బన్నసాధరన మైకట్టు, కవచ, యువరత్న వంటి చిత్రాల్లో కీలక పాత్రలతో నటించిన వశిష్ట సింహ తెలుగులో హీరోగా పరిచయం అవుతున్నాడు.మరి సంపత్ కథతో సిద్ధమవుతున్న ఈ సినిమా నిర్మాతకి ఎంత వరకు సక్సెస్ అందిస్తుంది అనేది చూడాలి.