అలా ఎలా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి కుమారి 21ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ గా మారిపోయిన అందాల భామ హెబ్బా పటేల్.రెండో సినిమాతోనే డిఫరెంట్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ అమ్మడు తరువాత ఎక్కువగా ఆ తరహా గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యింది.
నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు చేసిన కుమారి 21ఎఫ్ క్యారెక్టరైజేషన్ నుంచి బయటకి రాలేకపోయింది అనే నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.దీంతో హెబ్బాకి అవకాశాలు వచ్చిన తరువాత మెల్లగా తగ్గుతూ వచ్చాయి.
దీంతో తన ఇమేజ్ మార్చుకోవడం కోసం వెబ్ సిరీస్ కూడా ఈ అమ్మడు చేసింది.అయితే అక్కడా కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
అయితే తనలోని నటిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించే వేరే యాంగిల్ లో తనని తాను ప్రెజెంట్ చేసుకోవడానికి ఈ అమ్మడు రెడీ అవుతుంది
అందులో భాగంగా సంపత్ నంది కథతో తెరకెక్కుతున్న ఓదెలు రైల్వే స్టేషన్ అనే సినిమాలో పక్కా తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా డీ గ్లామర్ లుక్ లో దర్శనం ఇస్తుంది.ఆమె పాత్ర పూర్తిగా పల్లెటూరిలో అమాయక యువతిగా ఉంటుందని తెలుస్తుంది.
దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్ ఓదెలు రైల్వే స్టేషన్ లో హెబ్బా క్యారెక్టర్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.ఈ లుక్ లో పరికిణీ కట్టుకొని చేటలో బియ్యం ఏరుతూ గుమ్మం ముందు కూర్చొని ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లు ఉంది.
డీగ్లామర్ పాత్రలో ఈ సారి అందరిని అమ్మడు మెస్మరైజ్ చేయబోతుంది అని లుక్ చూస్తుంటే తెలుస్తుంది.కెకె రాధామోహన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో అశోక్ తేజ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.