దేశవ్యాప్తంగా గత కొన్ని రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.దేశ రాజధాని ఢిల్లీలో అయితే దాదాపు 18 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కుండపోత వర్షం.
కురిసినట్లు ఇటీవల మీడియాలో వార్తలు రావడం తెలిసిందే.ఇప్పుడు ఇదే రీతిలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా.
రికార్డు స్థాయిలో కుండపోత వర్షం కురిసినట్లు అధికారులు తెలియజేశారు.రికార్డు స్థాయిలో ఇటీవల కుండపోత వర్షాలు పడడంతో రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు ఇళ్లల్లోకి నీరు చేరిపోయాయి.
వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.లక్నో నగరం నీట మునిగింది.
రోడ్లన్నీ జలమయం కావడంతో వాహన దారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇళ్లలోకి వరదనీరు చేరడంతో పాటు వీధులలో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోపక్క రోడ్ల పై పెచ్చు కూడా పడిపోవడంతో.పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
రాకపోకలు కూడా నిలిచిపోయాయి.ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగించడానికి రెడీ అయ్యింది.రోడ్డుపై నిలిచిపోయిన వరదనీటిని కలిగిస్తూ వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇదిలా ఉంటే మరో రెండు రోజులపాటు డ్యూటీ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.