తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం.
పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని పేర్కొన్నారు.బాలాసోర్ కి తూర్పు ఆగ్నేయ దిశగా 250 కిలో మీటర్ల దూరంలో, సాగర్ దీవులకు ఆగ్నేయ దిశగా 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిందని వెల్లడించింది.
పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రానున్న ఆరు గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.అనంతరం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల్లోని బాలాసోర్, సాగర్ ద్వీపం మధ్యన సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.