ఇటీవల వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలో పలు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో పలు జిల్లాలకు రానున్న రెండు రోజుల్లో భారీ వర్షం సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
సూర్యాపేట,యాదాద్రి భువనగిరి,నల్గొండ,సంగారెడ్డి,మెదక్ వికారాబాద్, జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.హైదరాబాద్,రంగారెడ్డి,వరంగల్ సహా మరో 12 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ చేసింది.