వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.
కొన్ని రోజులుగా ఎండలు మండిపోతుండగా.వీటి ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలు ఆవరించాయి.
దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.అదేవిధంగా వచ్చే మూడు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
ఈ క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.