రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారం పట్టుబడింది.విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడిన బంగారం విలువ రూ.70 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.