తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.హైదరాబాద్ నగరంలో కూడా భారీగా వర్షాలు కురియడంతో.నగరంలో వరద నీరు ముంచెత్తుతోంది.ఈ క్రమంలో భారీ వర్షాలకు నగరంలో కొన్ని కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.ముఖ్యంగా ముసరాంబాద్ బ్రిడ్జిపై నుంచి వరద పోటెత్తుతోంది.ఈ క్రమంలో రెండు రోజులగా వరదనీటి లోనే హబీబ్ నగర్ ఉంది.
ఈక్రమంలో ఇళ్లలోకి వరద నీరు రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.విరామం లేకుండా వర్షం పడుతూ ఉండటంతో నగరంలో చాలాకాలం నీళ్లు జలదిగ్బంధంలో కి వెళ్లిపోయాయి.
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీంతో అధికారులు వారిని కాపాడటం కోసం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.మరో పక్క తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు భారీగా పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.దీంతో హైదరాబాదు సహా మరో ఐదు జిల్లాలలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది.
ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాలలో దంచికొడుతున్న వర్షాలు కారణంగా చెరువులు, వాగులు నదులు పొంగిపొర్లుతున్నాయి.గ్రామాలకు రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.దీంతో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతూ ఉన్నారు.
తాజా వార్తలు