కర్నూలు జిల్లాలోని సుంకేశుల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 23 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 93,023 క్యూసెక్కులుండగా.ఔట్ ఫ్లో 96,761 క్యూసెక్కులుగా ఉంది.అదేవిధంగా ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా.ప్రస్తుతం 0.8 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు.ఈ క్రమంలో ప్రాజెక్ట్ పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.