భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని జలాశయం నిండుకుండలా దర్శనమిస్తోంది.డ్యామ్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.దీంతో నీటిమట్టం 404.80 అడుగులకు చేరింది.అప్రమత్తమైన అధికారులు జలాశయం 4 గేట్లు ఎత్తి 24 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.డ్యామ్ నీటి సామర్థ్యం 407 అడుగులుండగా, ఇన్ ఫ్లో 14 వేల క్యూసెక్కులుగా ఉందని తెలిపారు.
ఈ క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.