ఒకప్పుడు సాధారణ మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో ఎప్పుడూ ముందుండి అతి తక్కువ ధరలకే మొబైల్ ఫోన్లను అందించే స్వదేశీ మైక్రో మ్యాక్స్ సంస్థ ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన తర్వాత పోటీని తట్టుకోలేక పూర్తిగా వెనుకబడి పోయింది.ప్రస్తుతం ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ల తయారీదారులతో పోటీ పడలేక మరియు వినియోగదారులకు కావలసిన ఫీచర్లు అందించలేకపోయింది.
దీంతో మొబైల్ ఫోన్ల మార్కెట్ శాతంలో తమ వాల్యూ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఎలాగైనా తమ పూర్వవైభవాన్ని చాటుకునేందుకు మైక్రోమ్యాక్స్ తన కొత్త ఫీచర్ ఫోన్ ని మార్కెట్లోకి తెచ్చింది.ఇందులో భాగంగా రూ.12999/- రూపాయల విలువైన మైక్రోమాక్స్ ఇన్ఫినిటీ ఎన్11 అనే ఫీచర్ ఫోన్ ని కేవలం 5,499/- రూపాయలకు అందిస్తూ భారీ ఆఫర్ ను మైక్రోమాక్స్ ప్రకటించింది.ఈ ఆఫర్ దేశంలోని ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ వెబ్సైట్ అయినటువంటి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంచింది. అంతేగాక ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్, క్రెడిట్/ డెబిట్ కార్డులు, బజాజ్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా ఐదు శాతం రాయితీ వస్తుంది.
అతి తక్కువలో వస్తున్న ఈ ఫీచర్ ఫోన్ లో వినియోగదారులకు మంచి ఫీచర్లనే అందించారు.ఇందులో 2జీబి ర్యామ్ 32జీబి ఇంటర్నల్ మెమోరీ, 4000 ఎంఎహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ, రెండు సిమ్ములు, మరియు ఫోన్ సెక్యూరిటీ కోసం వెనుక వైపున ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి అద్భుత ఫీచర్లను ఈ ఫోన్లో అందించారు.