ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి భారత్ ను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు.
కేంద్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.ఇంకా ఈ నేపథ్యంలోనే నిన్న జనతా కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.
దీంతో నిన్న దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా ఉదయం 7 నుండి రాత్రి 9 గంటల వరుకు బయటకు రాకుండా జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు.ఆతర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు షట్ డౌన్ ప్రకటించడం అందరికి తెలిసిందే.
ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా ఈ నెల 31వ తేదీ వరుకు కావాల్సిన సరుకులు అన్ని ముందుగానే కొనేస్తున్నారు.
వాటికీ కారణం ఈ 31వ తేదీ వరుకు మొత్తం రాష్ట్రమంతా కూడా షాట్ డౌన్ అవ్వడం వల్ల.
ప్రజలందరూ 2 లేదా 3 నెలలకు కావాల్సిన అన్ని సరుకులు.కూరగాయలు కొనేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో రైతు బజార్లు కిటకిటలాడుతున్నాయి.రైతులకు కూడా ఇదే సమయం అని కాస్త రేట్లు పెంచారు.
అందులో తప్పు లేదులే.