మధ్యప్రదేశ్ లో దారుణం, మూగ బాలికను కూడా వదలలేదు

దేశవ్యాప్తంగా ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నప్పటికీ మహిళలపై మాత్రం అఘాయిత్యాలు ఏమాత్రం ఆగడం లేదు.ఎవరెన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా దేశంలో ప్రతి రోజు ఎక్కడో ఒకచోట మహిళలపై దారుణాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

 Hearingspeech Impairedgirl In Madhyapradesh-TeluguStop.com

తాజాగా మధ్యప్రదేశ్ లో అమానవీయ ఘటన ఒకటి చోటుచేసుకుంది.కొందరు కళ్లు మూసుకుపోయిన కామాంధులు మూగ బాలిక అన్న జ్ఞానం కూడా లేకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఘటన బుధవారం మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లా లో చోటుచేసుకుంది.మూగ బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుంది.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రేవా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.నిందితుల్లో ఒక మైనర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇద్దరు నిందితులతో పాటు ఒక మైనర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.బాధితురాలి వాంగ్మూలం ట్రాన్స్ లేటర్ల సహాయం తో నమోదు చేస్తున్నామని ఎస్పీ అబిద్ ఖాన్ తెలిపారు.

ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.ఈ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube