దేశవ్యాప్తంగా ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నప్పటికీ మహిళలపై మాత్రం అఘాయిత్యాలు ఏమాత్రం ఆగడం లేదు.ఎవరెన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా దేశంలో ప్రతి రోజు ఎక్కడో ఒకచోట మహిళలపై దారుణాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
తాజాగా మధ్యప్రదేశ్ లో అమానవీయ ఘటన ఒకటి చోటుచేసుకుంది.కొందరు కళ్లు మూసుకుపోయిన కామాంధులు మూగ బాలిక అన్న జ్ఞానం కూడా లేకుండా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటన బుధవారం మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లా లో చోటుచేసుకుంది.మూగ బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తుంది.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రేవా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.నిందితుల్లో ఒక మైనర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.
ఇద్దరు నిందితులతో పాటు ఒక మైనర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.బాధితురాలి వాంగ్మూలం ట్రాన్స్ లేటర్ల సహాయం తో నమోదు చేస్తున్నామని ఎస్పీ అబిద్ ఖాన్ తెలిపారు.
ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.ఈ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.