మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ వైఎస్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.మే 31న అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సునీతా రెడ్డి సుప్రీం ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు.సీబీఐ అభియోగాలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్ లో పేర్కొన్నారు.
కాగా సునీతారెడ్డి పిటిషన్ పై సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది.