ఎన్డీఏ కేరళ కన్వీనర్ తుషార్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.పిటిషన్ విచారణలో భాగంగా 41 (ఏ) సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి నిందితుల జాబితాలో చేర్చారని తుషార్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.41 (ఏ) సీఆర్పీసీ నోటీసులకు జవాబు ఇవ్వకుండా లుక్ అవుట్ నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.ఈ క్రమంలో తుషార్ ను అరెస్ట్ చేయడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అదేవిధంగా సిట్ దర్యాప్తునకు సహకరించాలని తుషార్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.