తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.
అయితే నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.సుప్రీంకోర్టు తీర్పులను నిందితుల తరపు లాయర్ ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలో రేపు మరోసారి ప్రభుత్వ వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది.అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.