బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసును ఈడీ విచారించడాన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
ఈ మేరకు ఈడీ ఈసీఐఆర్ పై స్టే ఇవ్వాలని….నోటీసులను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఈసీఐఆర్ నమోదుపై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది.కౌంటర్ కు రిప్లై ఇచ్చేందుకు రోహిత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టును సమయం కోరారు.
అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.