విషమంగా మారిన ఆరోగ్యశాఖ మంత్రి ఆరోగ్యం!

దేశ రాజధాని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ ఆరోగ్య‌ప‌రిస్థితి మ‌రింత విష‌మంగా మారినట్లు తెలుస్తుంది.మూడు రోజుల క్రితం కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయనను ఢిల్లీ లోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే.

 Delhi Health Minister Satyendra Jain Condition Worsens , Delhi Health Minister C-TeluguStop.com

అయితే ఆసుపత్రి లో వైద్యం పొందుతున్న ఆయనకు గత రెండు రోజులుగా శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు ఎదురుకావడం తో ఆక్సిజన్ అందిస్తున్నారు వైద్యులు.అయితే సడన్ గా ఆయన ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం తో ఢిల్లీ హెల్త్ మిమిస్టర్ ని మరో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చినట్లు తెలుస్తుంది.
గత మూడు రోజుల నుంచి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న సత్యేందర్ జైన్ పరిస్థితి మ‌రింత‌ క్షీణించిందని, అతన్ని రాజధానిలోని సాకేత్ మాక్స్ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రికి త‌ర‌లించినట్లు సమాచారం.అక్క‌డ ఆయ‌న‌కు ఫ్లాస్మా చికిత్సకోసం ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రోవైపు సత్యేందర్ జైన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. క‌రోనాతో పోరాడుతున్న ఢిల్లీ ఆరోగ్య‌మంత్రి స‌త్యేంద్ర జైన్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు షా.

తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శాసనసభ్యుడు అతిషి, మరో ఇద్దరు పార్టీ నాయకులు కూడా శ్వాసకోశ వ్యాధి బారిన పడ్డారు.సీఎం అరవింద్ కేజ్రీవాల్ సలహాదారు అక్షయ్ మరాఠే, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సలహాదారు అభినండిత మాథుర్ కు కూడా క‌రోనా పాజిటివ్‌ తేలడం తీవ్ర కలకలం రేపుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube