ప్రతి పౌరుడికి హెల్త్ ఐడీ : ప్రధాని మోదీ

దేశ రాజధాని ఢిల్లీలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆడంబరంగా జరిగాయి.పంద్రాగస్టు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ రాజ్ ఘాట్ వద్ద అమర వీరులకు నివాళులర్పించి ఎర్రకోటకు వచ్చారు.

 Delhi, Independence Day, Celebretions, Modhi-TeluguStop.com

వేడుకల్లో 5 వేల మందికి మించకుండా కేంద్ర మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఎర్రకోటకు చేరుకుని భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం ఎర్రకోటపైకి వెళ్లి జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.అనంతరం జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.‘‘ భారతీయులకు పంద్రాగస్టు శుభాకాంక్షలు.దేశంలో పురోగతిని సాధిస్తోంది.ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనాపై పోరాడే సమయం వచ్చింది.

దేశ వ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనాపై వ్యాక్సిన్ కోసం ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు.త్వరలో వ్యాక్సిన్ వస్తుందనే నమ్మకం నాకు ఉంది.

ఇప్పటికే మూడు వ్యాక్సిన్లు తుది దశలో ప్రయోగాలు జరుగుతున్నాయి.కరోనా సమయంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డులకు జారీ చేయడం జరుగుతుంది.

వైద్యులు కరోనాపై నిరంతరం పోరాడుతున్నారు.వారి సేవలు ఎప్పటికి మరవలేం.

ఆత్మనిర్భర్ భారత్ పేరుతో మరో అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాం.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేసి విజయం సాధించాలి.

’’ అంటూ ప్రధాని పేర్కొన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube