ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా 55 నమోదు అయ్యాయి.గడచిన 24 గంటల్లో 28,788 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 55 పాజిటివ్ కేసులు కొత్తగా బయటపడ్డాయి.
ఇదిలా ఉంటే గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వలన ఏలాంటి మరణాలు కూడా సంభవించే లేదు.ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ .హెల్త్ బులిటెన్ లో విడుదల చేసింది.దీంతో రాష్ట్రంలో కొత్తగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,88,869 కి చేరింది.
ఇక రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 7162.
ఇదే తరుణంలో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 117 కాగా….
మొత్తం సంఖ్య 8,80,972.దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ లో ఉన్న కరోనా కేసులు 735 అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సిన్ సామాన్యులకు మార్చు మూడవ వారం నుండి వెయ్యటానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.రానున్నది వేసవి కాలం కావడంతో పైగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో… మరింతగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు చెప్పుకొస్తున్నారు.