మనిషి ఆరోగ్యంగా ఉండటానికి తినే ఆహారంలో కూరగాయలు, పండ్లు ఎంతగా ఉపయోగపడుతాయో వేరే చెప్పక్కర్లేదు.ఫ్రూట్స్ ,కాయగూరలను తినడం వల్ల అనేక విటమిన్స్ శరీరాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉంటాయి.
కాని వీటితో మనం అంతర దృఢత్వం మాత్రమే కాదు… బాహ్య సౌందర్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.పండ్లు,కూరగాయలతో సౌందర్యాన్ని ఎలా మెరుగుచేసుకోవచ్చో చూద్దాం.
యాపిల్ పండులో విటమిన్లు ఏ, సీ మరియు రాగి వంటి పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి.అందుకే ఒక స్పూన్ కి సరిడా యాపిల్ తురుము తీసుకుని రెండు స్పూన్ల కొబ్బరి నీళ్ళు , నాలుగు చుక్కల నిమ్మరసం వేసుకుని ముద్దలా తయారు చేసుకుని ముఖానికి రాసుకోవాలి.15 నిమిషాలు అలాగే ఉంచి తరువాత శుభ్రంగా కడిగేసుకోవాలి.ఇలా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే చర్మం మీద ముడతల ప్రభావం కమేపీ తగ్గుతుంది.
అంతేకాదు ఎలాంటి చర్మం వారికి అయినా సరే ఈ చిట్కా పనిచేస్తుంది.
ఇక మనం కూరలలో నిత్యం వాడే టమాటా చర్మాన్ని కాపాడుతుంది.టమాటా రసాన్ని ముఖానికి పూసి వేళ్ళతో చర్మానికి బాగా పట్టేలా మర్దనా చేయాలి.అనంతరం 10 నిమిషాల తరువాత మొఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మీ ఫేస్ మృదువుగా రావడమే కాకుండా ముఖం ఎప్పుడు ఫ్రెష్ గా కనపడుతుంది.
క్రమం తప్పకుండ ఈ పద్దతులు ఫాలో అయితే తప్పకుండా పలితం మీకే తెలుస్తుంది
.