సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది.మెల్ల మెల్లగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.
ఈ వేసవి కాలంలో చిరాకు పుట్టించి చెమటలతో పాటు అతి దాహం సమస్య తెగ ఇబ్బంది పడుతుంది.ఎన్ని నీళ్లు తాగినా మళ్లీ నిమిషాల వ్యవధిలోనే గొంతు తడారిపోతుంటుంది.
ఈ అధిక దాహం సమస్యకు చెక్ పెట్టేందుకు చాలా మంది కూల్ డ్రింక్స్, సోడాలు, టీలు, కాఫీలు వంటివి ఎక్కువగా తీసుకుంటారు.కానీ, ఇలాంటి వాటి కన్నా సమ్మర్ సీజన్లో పుదీనా వాటర్ తీసుకోవడం ఎంతో మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పుదీనా దీని రుచి, వాసన ఎంత అద్భుతంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అందుకే వంటల్లో పుదీనాను విరి విరిగా ఉపయోగిస్తుంటారు.ఇక పుదీనాలో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి.పొటాషియం, మాంగనీస్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.
అందుకే పుదీనా ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు అంటారు.
అందులోనూ వేసవి కాలంలో పుదీనాతో తయారు చేసుకున్న వాటర్ తాగితే మస్తు బెనిఫిట్స్ పొందొచ్చు.ముందుగా కొన్ని పుదీనా ఆకులను తీసుకుని వాటర్లో వేసి మరిగించాలి.బాగా మరిగిన తర్వాత వాడబోసి ఈ వాటర్లో కొద్దిగా స్వచ్ఛమైన తేనెను కలిపి సేవించాలి.
ఈ పుదీనా వాటర్ను ప్రతి రోజు ఒకటి లేదా రెండు కప్పులు తీసుకుంటే వేసవిలో తరచూ ఎదురయ్యే తలనొప్పి, ఒత్తిడి చికాకు వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
అలాగే ఈ సీజన్లో ఇబ్బంది పెట్టే అతిదాహం సమస్య పుదీనా వాటర్ దూరం చేస్తుంది.
ఇక వేసవిలో చాలా మంది డీహైడ్రేషన్ సమస్యతో బాధ పడతారు.అయితే పుదీనా వాటర్ తీసుకుంటే శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది.
ఇక మధుమేహం ఉన్న వారు పుదీనా వాటర్ తీసుకుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.మరియు జీర్ణ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.