ప్రస్తుతం చలి కాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్లో చలితో పాటుగా జబ్బులు కూడా ఎక్కువగానే ఉంటాయి.
అందుకే మిగిలిన సీజన్స్తో పోలిస్తే.ఈ వింటర్ సీజన్లో ఆరోగ్యంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటాయి.
అయితే ఆ చలి కాలంలో మన ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.కొన్ని ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి.
అలాంటి వాటిలో కివి పండు ఒకటి.చైనీస్ గూస్ బెర్రీ అని పిలవబడే కివి పండ్లలో పోషక విలువలు అపారంగా ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్య పరంగానే కాకుండా.సౌందర్య పరంగా కూడా ఉపయోగపడతాయి.ముఖ్యంగా ఈ చలి కాలంలో కివి పండ్లను ప్రతి రోజు ఒకటి లేదా రెండు చప్పున తీసుకోవాలి.అలా తీసుకుంటే కివి పండ్లలో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందించి.
సీజనల్గా వచ్చే రోగాలను అంటే జలుబు, దగ్గు, ఫ్లూ, వైరల్ ఫీవర్స్ వంటి వాటిని దరి చేరకుండా అడ్డుకట్టు వేస్తుంది.ఇక ఈ సీజన్లో చర్మ పగుళ్లు మరియు డ్రై స్కిన్ సమస్యలను దాదాపు అందరూ ఎదుర్కొంటారు.
అయితే కివి పండ్లు తీసుకోవడం వల్ల.అందులో ఉండే విటమిన్ ఇ, ఫోలేట్ మరియు ఇతర పోషకాలు చర్మ పగుళ్లను తగ్గించి మృదువుగా, కాంతివంతంగా మారుస్తుంది.కివి పండ్లు తీసుకోవడం వల్ల మొటిమల సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.అలాగే ఈ చలి కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటారు.అయితే కివి పండ్లు డైలీ డైట్లో చేర్చుకుంటే గనుక.అందులో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్, హై ఫైబర్ కంటెంట్ మొదలైనవి మన శరీరంలో కొవ్వుని పేరుకుపోకుండా చేస్తాయి.
ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.ఇక ఆస్తమా వ్యాధి ఉన్న వారు చలి కాలంలో మరింతగా ఇబ్బంది పడుతుంటారు.అయితే అలాంటి వారు కిడి పండ్లు ప్రతి రోజు తీసుకుంటే.ఆస్త్మా లక్షణాల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.ఇక బ్లడ్ షుగర్ లెవల్స్ను అదుపు చేయడంలోనూ కివి పండ్లు ఉపయోగపడతాయి.కాబట్టి, మధుమేహం ఉన్న వారు కూడా కివి పండ్లు తీసుకుంటే మంచిది.