అద్భుమైన రుచి కలిగే ఉండే పండ్లలో సీతాఫలం ఒకటి.అందుకే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటుంటారు.
అయితే రుచి కాదు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాపర్, పొటాషియం, సోడియం వంటి మినరల్స్తో పాటు విటిమన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్, యాంటీ అక్సిడెంట్స్, ప్రోటీన్, ఫైబర్ ఇలా బోలెడన్ని పోషకాలను కూడా కలిగి ఉంటుంది.ఇన్ని పోషకాలు ఉండటం వల్లే ఆరోగ్యానికి సీతాఫలం ఎంతో మేలు చేస్తుంది.
ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పండ్లను తీసుకుంటే ఎన్నో లాభాలు పొందొచ్చు.మరి అవేంటో చూసేయండి.
సాధారణంగా గర్భిణీ స్త్రీలలో అత్యధికంగా కనిపించే సమస్య మలబద్ధకం.అయితే ఈ సమస్యను నివారించడంలో సీతాఫలం గ్రేట్గా సహాయపడుతుంది.రెగ్యులర్గా ఒక సీతాఫలం తింటే గనుక అందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని నివారించి జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగు పరుస్తుంది.
గర్భిణీల్లో కామన్గా కనిపించే సమస్య రక్త హీనత.ఈ సమస్య కారణంగా తల్లే కాకుండా కడుపులోని శిశువు కూడా ఎఫెక్ట్ అవుతుంది.అందుకే రక్తహీనతను నివారించుకునేందుకు ఐరన్ ట్యాబ్లెట్స్ వాడతారు.
అయితే సీతాఫంలోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది.కాబట్టి వీటిని తింటే రక్తవృద్ధి జరుగుతుంది.
అలాగే సీతాఫలంను డైట్లో చేర్చుకోవడం వల్ల అందులో ఉండే పోషక విలువలు గర్భస్రావం అవ్వకుండా రక్షిస్తాయి.మరియు కడుపులోని శిశివు రోగ నిరోధక వ్యవస్థ, నాడీవ్యవస్థ, బ్రెయిన్ డెవలప్ మెంట్ కు సహాయపడతాయి.
కొందరు గర్భిణీలు నెలలు నిండకుండా ప్రసవిస్తుంటారు.దాంతో పుట్టిన బిడ్డ చాలా వీక్గా ఉంటుంది.
అయితే రెగ్యులర్గా ఒక సీతఫలం తింటే ఈ ప్రీమెచ్యుర్ బర్త్ను అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇక గర్భిణీలు సీతాఫలంను తీసుకోవడం వల్ల రక్త పోటు అదుపులో ఉంటుంది.
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.మరియు నీరసం, అలసట వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.