ప్రపంచాన్ని వణికించిన వైరస్ కరోనా.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించింది.ఆర్ధిక వ్యవస్దను దెబ్బ తీసింది.10 లక్షల మందికిపైగా ప్రాణాలు తీసిన ఈ కరోనా వైరస్ 3 కోట్లమందికిపైగా వ్యాపించింది.మనుషులలో మానవత్వాన్ని చంపింది, బంధుత్వాలను చెడిపింది, ఎంతోమందిని ఆర్ధికంగా చంపేసింది.అలాంటి ఈ కరోనా వైరస్ పై పోలీసులు బొమ్మ బొరుసు ఆడమంటూ ట్వీట్ చేశారు.దీని వెనుక అసలు రహస్యం ఏంటంటే.
కరోనా వైరస్ జయించగలుగుతామా? లేదా అనే విషయం తెలియాలి అంటే బొమ్మ బొరుసు ఆడాలని, బొమ్మ కరోనా వైరస్ ను జయించవచ్చు అంటూ ముంబై పోలీసులు ఓ ట్వీట్ పెట్టారు.ఆ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. రెండు కాయిన్స్ రెండు వైపులా పెట్టిన పోలీసులు దాని వెనుక పెద్ద అర్ధం ఉన్నదే పెట్టారు.కరోనా వైరస్ ఉంది బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోతే మీ సంగతి అంతే అన్నట్టు పెట్టారు.
వీలైనంత వరకు ఇంట్లో నే ఉండాలని వారు సూచించారు.
ఒకవేళ బయటకు వచ్చిన మాస్కు, శానిటైజర్ ధరించాలని అప్పుడే కరోనా నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలరని తెలిపారు.ఇక హెడ్స్ పడితే జాగ్రత్తలు తీసుకొని కరోనా పై జయిస్తారని, టేల్స్ పడితే కరోనా వైరస్ పై ఓడిపోతారని పోలీసులు పరోక్షంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
మహారాష్ట్ర పోలీసులు షేర్ చేసిన ఈ బొమ్మ బొరుసు ఆటా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఎంత ఆలోచన చేశారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
గతంలో కూడా మహారాష్ట్ర పోలీసులు కరోనా వైరస్ పై అవగాహనా కల్పిస్తూనే కరోనా నియమాలను పాటించిన వారికి చుక్కలు చూపించారు.ఇప్పుడు మరోసారి ఈ ట్వీట్ తో నెటిజన్ల మనసు దోచుకున్నారు మహారాష్ట్ర పోలీసులు.
.