సాధారణంగా 50 ఏళ్లు దాటాక మనుషుల్లో సత్తువ అనేది నెమ్మది నెమ్మదిగా క్షీణించడం సహజం.ఈ వయసు వారు ఇంటి పనులు చేయగలుగుతారేమో గానీ సాహసయాత్రలు వంటివి చేయడం దాదాపు అసాధ్యం.
అయితే తాజాగా అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు సిద్ధపడ్డాడు 66 ఏళ్లకు చెందిన ఓ వ్యక్తి.సంకల్పం ఉంటే.ఏదైనా సాధించవచ్చాని.దానికి వయసు అడ్డురాదని నిరూపించారు కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లా కిదియూరుకు చెందిన గంగాధర కడేకర్.
మామూలుగా కాలువలో ఈత కొట్టడం అంటేనే ఎందరికో భయం.అలాంటిది ఓ 66 ఏళ్ల వ్యక్తి ఏకంగా అరేబియా సముద్రం లోనే ఈత కొట్టాడు.అదీ కూడా కాళ్లకు గొలుసులు కట్టుకుని మరీ.మూడు కిలోమీటర్లకు పైగా ఈతకొట్టి ఆ వ్యక్తి ఎందరినో ఆశ్చర్యపరిచాడు.ఈయన చేసిన సాహసానికి.గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది.సోమవారం ఆయన అరేబియా సముద్రం లోని కిదియూరు వద్ద ఉదయం 7.50 గంటలకు ఈత కొట్టడాన్ని ఈయన ప్రారంభించారు.అప్పటి నుండి ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా 5.35 గంటలపాటు ఈది మూడు కిలోమీటర్లకు పైగా దూరాన్ని చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఇలా ఈదడం కోసం ఎన్నో రోజులు కష్టపడ్డానని.అందుకు ప్రతిఫలం దక్కిందని అన్నారు.సాహసాలు చేయడం అంటే ఇష్టమని.
అందులో భాగంగానే ఈత కొట్టేటప్పుడు గొలుసులు కట్టుకొని ఈత కొట్టడం ప్రాక్టీస్ చేసానని తెలిపారు.కాగా, పలువురు ఈయన సాహసాన్ని చూసి ఔరా.! అంటుండగా.పలువురు అసలు కాళ్లకు గొలుసులు కట్టుకుని ఈదడం ఎలా సాధ్యపడింది అంటూ ప్రశ్నిస్తున్నారు.