సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిర్మాతలు ఉన్నారు.అలాంటి వారిలో నట్టి కుమార్ ఒకరు.
దర్శకుడిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి కుమార్ పేరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినబడుతోంది.ఈ క్రమంలోనే నిర్మాత నేడు (సెప్టెంబర్ 8) పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశంలో ముచ్చటించారు.
ఈ సందర్భంగా నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది తన పుట్టినరోజు తనకు ఎంతో ప్రత్యేకమైనది అని తెలిపారు.తన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 32 సంవత్సరాలు అవుతోందని ఆఫీస్ బాయ్ నుంచి నిర్మాత స్థాయికి ఎదిగానని ఎంతోమంది దర్శకులు నిర్మాతల దగ్గర తాను పని చేశానని తెలిపారు.
ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో రమేష్ ప్రసాద్ గారు నాకు చేసిన ఆర్థిక సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేని తన గురువులు, తనకు సహాయం చేసిన వారిని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నట్టికుమార్ ప్రతి ఏడాది తన పుట్టిన రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని తెలిపారు.ఈ ఏడాది తన పుట్టిన రోజు మరింత ప్రత్యేకమని, తన కుమారుడు నట్టి క్రాంతి హీరోగా నటించినటువంటి సైకో వర్మఅలాగే తన కూతురు నట్టి కరుణ హీరోయిన్ గా పరిచయమవుతూ చేసిన డీఎస్జే (దెయ్యంతో సహజీవనం) చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.2000 సంవత్సరంలో దర్శకత్వం మానేసిన తాను ప్రస్తుతం తన కూతురు నటించిన డీఎస్జే సినిమాకు దర్శకత్వం వహించానని, అలాగే రాజశేఖర్అర్జున సినిమా విడుదల కాబోతుందని ఈ సందర్భంగా నిర్మాత నట్టికుమార్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు.