మన స్నేహితులు లేదా మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడక్కడ మనకు కవలలు కంటి ముందర కనబడుతూనే ఉంటారు.అలాంటి వారిని రోజు చూసినా సరే కొన్ని కొన్ని సందర్భాలలో ఒకరిని అనుకొని మరొకరిని మాట్లాడించడం తర్వాత పొరపాటును సర్దుకోవడం లాంటివి జరుగుతూనే ఉండటం మనకు జరిగిన సంఘటన లలో ఒకటి.
ఇలా చాలా మంది కవలలను ఎవరు గుర్తుపట్టడం అంత ఈజీ కాదు.ఇలాంటి పరిస్థితి ఏ విధంగా ఉంటే 25 కవలల జంటలు ఒకేచోట ఉంటే ఆ కన్ఫ్యూజన్ ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించండి.
అయితే తాజాగా ఇలాంటి అరుదైన సంఘటనకి విశాఖ నగరం వేదికగా నిలిచింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
ప్రపంచ కవలల దినోత్సవం పురస్కరించుకొని ఈ 25 కవల జంటలు ఒకే చోటికి చేరుకొని వారందరూ సందడి చేశారు.ఎవరికి వారు పర్ఫామెన్స్ వాళ్ళు చేస్తూ రోజంతా వారు తెగ ఎంజాయ్ చేశారు.
అన్నదమ్ములు, అక్కచెల్లెలు, అన్నా చెల్లెలు ఇలా అందరూ కలిసి సంబరాలలో మునిగి తేలారు.ఈ 25 జంటలు ఎప్పుడు టచ్ లో ఉంటూ ఒకరినొకరు పలకరించకుండా ఉంటారు.
ప్రతి సంవత్సరం వీరందరూ ఒక ఒక చోటికి చేరుకొని అక్కడ సంబరాలు జరుపు కొంటారు కాకపోతే కరోనా కారణంగా 2020 సంబరాలకు బ్రేక్ పడింది.
అయితే తాజాగా ఈ 25 కవలల జంటలు ట్విన్స్ మీటింగ్ లో చిన్న వయసు నుండి పెద్ద వయసు వారి వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొని సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.
సెలబ్రేషన్స్ లో భాగంగా కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు కవలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎంజాయ్ చేశారు.ఈ సందర్భంగా వారు చాలా కవలలుగా ఉండడం వల్ల వారు ఎదుర్కొన్న సంఘటనలు అప్పుడప్పుడు జరిగిన సదా సన్నివేశాల గురించి వారు పార్టీలో చర్చించకుంటు సంబరాలు జరుపుకున్నారు.