కరోనా కారణంగా అన్ని ఆలయాల్లో భక్తుల దర్శనాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఈ సంవత్సరం కూడా భక్తులను ఆ భగవంతుడు కరుణించేలా కనిపించడం లేదు.
ఇకపోతే ఎన్ని సార్లు దర్శించుకున్నా మళ్లీ మళ్లీ చూడాలనిపించే పుణ్యక్షేత్రం శ్రీవారి నిలయం, తిరుమల క్షేత్రం.
ఈ స్వామి వారి దర్శనం కోసం రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు ఎందరో భక్తులు బుక్ చేసుకుని ప్రస్తుతం ఉన్న పరిస్దితుల వల్ల వెళ్లలేకపోతున్నారు.మరి ఈ టికెట్స్ వేస్టేనా అనే అనుమానం ఎందరిలో కలిగే ఉంటుంది.
అయితే ఇలాంటి వారికి ఊరట కలిగించే ప్రకటన టీటీడీ చేసింది.కాగా ఏప్రిల్ 21 నుండి మే 31 మధ్య ఆన్లైన్ ద్వారా రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకున్న వారికి తేదీలు మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలియచేసింది.భక్తులు స్వామి వారిని ఏడాది లోపు ఎప్పుడైనా దర్శించుకోవచ్చని స్పష్టం చేసింది.
కరోనా కారణంగా శ్రీవారిని దర్శించుకోలేని ప్రత్యేక దర్శన టికెట్లు ఉన్న భక్తులు ఇక చింతించకండి.టీటీడీ వారిచ్చిన అవకాశాని సద్వినియోగం చేసుకోండి.