రాజస్థాన్ రాజకీయాల్లో వాడీవేడీ తగ్గినట్లు కనిపిస్తోంది.మొన్నటివరకూ బలపరీక్ష నిరూపణ కోసం పోటీ పడిన సచిన్ పైలట్, సీఎం అశోక్ గెహ్లాట్ రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది.
రాజకీయ సంక్షోభానికి తెరదించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించడంతో వీరిద్దరూ కలవబోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.కానీ, మాటల యుద్ధంతో ఇన్ని రోజులు వాడీవేడీగా సాగిన తిరుగుబాటు తర్వాత సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఈ రోజు శాసనసభలో సమావేశం కానున్నారు.
రాజీ కుదిరితే ఈ నెల 14న రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం అవుతాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా రాజస్థాన్ రాజకీయాలు ఉత్కంఠాన్ని నెలకొల్పాయి.
సచిన్ పైలట్ వర్గం తిరుగుబాటుతో అశోక్ గెహ్లాట్ బలపరీక్షకు సిద్ధమయ్యారు.బల నిరూపణలో గెలుస్తారా? లేదా అని రాజస్థాన్ రాజకీయాలు వాడీవేడీగా జరిగాయి.బల నిరూపణకు సిద్ధమైనా కాంగ్రెస్ అధిస్థానం కలగజేసుకోవడంతో వీరిద్దరు ఒక్కటయ్యరనే చెప్పవచ్చు.కానీ సీఎం అశోక్ గెహ్లాట్ బలపరీక్షకే మొగ్గు చూపుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.దీనిపై తుది నిర్ణయం రావాలి అనుకుంటే రేపటి (14వ తేదీ) వరకు వేచి ఉండాల్సిందే.