హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్నీ పార్టీలు తమదైన ఎత్తుగడలతో ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.ఇందులో కొందరు సినీ తారలతో ప్రచారం చేయిస్తే.
కొందరు క్రీడాకారులతో ప్రచారం చేయించారు.మరికొందరు ఓటరు దేవుళ్లను మెప్పించేందకు తమకు తోచిన రీతిలో ఎత్తులకు పైఎత్తులు వేశారు.
కానీ బీజేపీ పార్టీ వారు ఏకంగా క్రీడాకారులను బరిలోకి దించి ఎన్నికల్లో పోటీ పడింది.
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భారత రెజర్లు బబితా ఫోగాట్ గురించి.
ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆమె భాజపాలో చేరింది.దీంతో ఆమెకు దాద్రీ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దించింది బీజేపీ.
దీంతో పార్టీలో అప్పటికే సీనియర్ అయిన సంబీర్ సాంగ్వాన్ పార్టీ నుండి బయటకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేశాడు.కానీ అక్కడి ప్రజలు నమ్మకస్తుడనే పేరున్న సంబీర్కే పట్టం కట్టడంతో బబితా ఎన్నికల రింగులో నాకౌట్ అయ్యింది.
ఒలింపిక్ విజేత అయిన మరో రెజ్లర్ యోగేశ్వర్ దత్ను బరోడా నియోజకవర్గం నుండి భాజపా బరిలో దించగా.కాంగ్రెస్ అభ్యర్ధి కృష్ణ హుడా చేతిలో ఘోరంగా ఓటమిపాలయ్యాడు.దీంతో ఆటలలో ప్రత్యర్థులను నాకౌట్లు చేసిన ఈ రెజ్లర్లు రాజకీయంగా ఎన్నికల రింగులో మాత్రం వారే నాకౌట్ అయ్యారంటూ హర్యానా ప్రజలు అంటోన్నారు.