ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంపై గతంలో తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.
ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు అనే నిబంధన పెట్టడం వల్ల రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడి పెట్టవని, దీని వల్ల విద్యార్థులు, నిరుద్యోగులకు నష్టం కలుగుతుందనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది.
అయితే జగన్ బాటలో చాలా రాష్ట్రాలు కూడా ఈ నిర్ణయాన్ని తమ రాష్ట్రంలో అమలు చేస్తున్నాయి.ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చట్టం చేశాయి.
ఈ క్రమంలో తాజాగా హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది.గవర్నర్ ఆమోదం అనంతరం ఈ చట్టం హర్యానాలో అమల్లోకి రానుంది.
గవర్నర్ కూడా త్వరలో ఆ బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశముంది.మరి చూడాలి ఇంకెన్ని రాష్ట్రాలు ఇలాంటి చట్టాన్ని అమల్లోకి తెస్తాయో.