పరిటాల హత్య పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ

పరిటాల రవి హత్య పై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు.పరిటాల రవి హత్య సమయంలో జగన్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సరఫరా చేశారంటూ సంచలన ఆరోపణలు చేయడం తో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

 Harshakumar Comments On Jagan-TeluguStop.com

అంతేకాకుండా జగన్ బాబాయి వివేకా హత్యకేసు విషయంలో కూడా దర్యాప్తు ముందుకు సాగకపోవడాననికి జగనే కారణమంటూ హర్షకుమార్ ఆరోపించారు.కచ్చులూరు బోట్ ప్రమాదం విషయంలో ఒత్తిడి తెచ్చినందుకే జగన్ ప్రభుత్వం తనపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపణలు చేసారు.

అలానే అమరావతి నుంచి రాజధాని మార్చాలంటే సీఎం జగన్ ముందుగా ఎన్నికలకు వెళ్లాలనీ డిమాండ్ చేశారు.

కచ్చులూరు బోట్ ప్రమాదంలో నిందితులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

తూర్పు గోదావరి జిల్లాలోని దేవిపట్నం మండల కచ్చిలూరు గ్రామానికి సమీపంలో ఉన్న గోదావరి నదిలో గతేడాది విషాద పడవ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube