మాజీ ఎంపీ హర్షకుమార్ జగన్, పవన్ కళ్యాణ్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీని లేకుండా చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపణలు చేశారు.
వైసీపీ.జనసేన.
బీజేపీ పార్టీతో కలిసి పక్కాగా.రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడానికి పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని.పావు దేశాలతో ఈ మూడు పార్టీలకు చెందిన నాయకులు వ్యవహరిస్తున్నారని, ఏపీలో కూడా టీడీపీ క్లోజ్ చేయటమే.
వీరి అంతిమ లక్ష్యం అని అన్నారు.అసలు తాను ఏ కులానికి చెందిన వ్యక్తిని.
అని .అంతకు ముందు చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రతీ చోట పొలాలను రెచ్చగొట్టేలా.డైలాగులు వేస్తున్నారని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ పర్యటనలకు అనుమతులు లేవని చెబుతూనే మరోపక్క ప్రభుత్వమే.
ఆయన పర్యటనలకు బాగా హైప్ క్రియేట్ అయ్యేలా… పక్కా ప్లానింగ్ తో వ్యవహరిస్తూ ఉందని.పేర్కొన్నారు.
ఇది టీడీపీని రాష్ట్రంలో లేకుండా చేయడమే.అనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క ప్లాన్ అని హర్ష కుమార్ తెలియజేశారు.
ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అభిమానులకు మరియు పార్టీ కార్యకర్తలు ఆవేశం వస్తుందో.అప్పుడు పర్యటనలకు పర్మిషన్ ఇస్తున్నారని చెప్పుకొస్తున్నారు.
నిజంగా పవన్ కళ్యాణ్ కి చిత్తశుద్ధి ఉంటే పది రోజుల పాటు తూర్పు గోదావరి జిల్లాలోనే ఉండి.రోడ్ల మరమ్మతు కార్యక్రమాలను.
చేపట్టాలని సూచించారు.ఏది ఏమైనా తెలుగు దేశం పార్టీని నిర్వీర్యం చేయడానికి పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా ఏపీలో మరింత ప్రాధాన్యత పెరిగే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు హర్ష కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో.
చర్చనీయాంశంగా మారాయి.