అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ రెండు రోజుల క్రితం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా హర్ష కుమార్ వైసీపీ పార్టీ మీద విమర్శలు కూడా చేసాడు.
టీడీపీ నుంచి తనకి అమలాపురం పార్లమెంట్ సీటు వస్తుందని హర్ష కుమార్ భావించారు.దీనికి పార్టీ నుంచి కూడా సానుకూలత రావడంతోనే అన్ని నిర్ణయించుకొని అతను టీడీపీలో చేరాడు.
ఇదిలా ఉంటే పార్టీలో చేరిన తర్వాత హర్ష కుమార్ ఊహించిన విధంగా అతనికి చంద్రబాబు ఎంపే టికెట్ కేటాయించలేదు.అమలాపురం నుంచి టీడీపీ తరుపున వేరొకరికి బాబు అవకాశం ఇచ్చారు.
దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన హర్ష కుమార్ తనకి గెలిచే బలం ఉందని భావించి రాజమండ్రి నుంచి ఇండిపెండెంట్ గా పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.తన కార్యకర్తలతో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవడానికి హర్ష కుమార్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.