అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘మజ్ను’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రేమమ్’కు రీమేక్గా ‘మజ్ను’ చిత్రం తెరకెక్కుతోంది.
మరో వైపు తమిళ ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో చైతూ హీరోగా ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం తెరకెక్కింది.ఆ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.
ఈ రెండు చిత్రాల తర్వాత నాగచైతన్య నటించబోతున్న సినిమాపై ఆసక్తికర ప్రచారం ఫిల్మ్ సర్కిల్స్లో జరుగుతోంది.
టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘గబ్బర్సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో నాగచైతన్య ఒక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన హరీష్ శంకర్తో సినిమాను చేసేందుకు స్టార్ హీరోలు ఇంకా భయపడుతున్నారు.దాంతో ఈయన మరో చిన్న హీరోతో సినిమా చేయాలని నిర్ణయించుకుని, చైతూను ఇటీవలే కలిసి ఒక కథను వినిపించినట్లుగా తెలుస్తోంది.
ఆ కథ చైతూకు నచ్చడంతో పాటు, వెంటనే నటించేందుకు ఓకే చెప్పాడు.ప్రస్తుతం హరీష్ శంకర్ ఆ కథను డెవలప్ చేసే పనిలో ఉన్నాడు.
త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి, వేసవిలోనే ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి.