మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తూనే తన నెక్ట్స్ చిత్రాలను లైన్లో పెట్టే పనిలో పడ్డారు.సైరా నరసింహారెడ్డి చిత్రం తరువాత వరుసబెట్టి సినిమాలను తెరకెక్కించాలని చిరు నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ఇప్పటికే తెరకెక్కుతున్న ఆచార్యతో పాటు మరో మలయాళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు కూడా ఒప్పుకున్నాడు.మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్న చిరు, ఆ బాధ్యతను సాహో చిత్ర దర్శకుడు సుజీత్కు అప్పగించారు.ఇక తెలుగులో మరో డైరెక్టర్ హరీష్ శంకర్తో చిరు ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే హరీష్ చెప్పిన ఓ స్టోరీలైన్ను మెగాస్టార్ ఓకే చేశారట.అయితే ఈ సినిమా చిరంజీవి నటించిన ఒకప్పటి బాక్సాఫీస్ బ్లాక్బస్టర్ మూవీకి సీక్వెల్గా రాబోతున్నట్లు తెలుస్తోంది.చిరంజీవి డ్యుయెల్ రోల్లో నటించిన సూపర్ హిట్ మూవీ ‘రౌడీ అల్లుడు’కు సీక్వెల్గా హరీష్ తన చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.1991లో వచ్చిన రౌడీ అల్లుడు చిత్రాన్ని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా బప్పీలహరి అందించిన సంగీతం సూపర్ హిట్గా నిలిచింది.అయితే సినిమా కథ వరకు ఓకే కానీ అప్పటి చిరంజీవి వయసులో ఉన్నాడు కాబట్టి ఆ రెండు పాత్రల్లో బాగా యాక్టివ్గా నటించారు.మరి ఇప్పుడు అదే తరహా ఎనర్జీని చూపిస్తారా.
అసలు ప్రేక్షకులు ఇప్పుడు ఇలాంటి కథను యాక్సెప్ట్ చేస్తారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.ఏదేమైనా హరీష్ శంకర్ అందిస్తున్న కథలో ఎలాంటి మార్పులు చేస్తారో తెలియాలంటే సినిమా పట్టాలెక్కేవరకు ఆగాల్సిందే.