మైత్రీ బ్యానర్ లో పవన్ మూడో సినిమా! గబ్బర్ సింగ్ దర్శకుడుతో

జనసేన పార్టీ అధినేతతో ఏపీ రాజకీయాలలో క్రియాశీలకంగా మారిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు.ఓ వైపు అధికార పార్టీ వైఫల్యాలపై ప్రజల తరుపున పోరాటం చేస్తూ ఉన్నారు.

 Harish Shankar Pawan Kalyan Mitri Movies-TeluguStop.com

మరో వైపు బీజేపీతో పొత్తు పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించారు.ఇదిలా ఉంటే రాజకీయాలతో బిజీగా ఉన్న జనసేనాని మరల సినిమాలు మొదలెట్టారు.

ఇప్పటికే పింక్ సినిమా రీమేక్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళిన పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం క్రిష్ దర్శకత్వంలో మూవీ కూడా స్టార్ట్ చేశాడు.ఈ సినిమా కూడా ప్రారంభోత్సవం సీక్రెట్ గా జరుపుకోవడంతో పాటు అఫీషియల్ గా ఎనౌన్స్ కూడా జరిగింది.

అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం మొదలు పెట్టగానే ఆ పార్టీ కీలక నేత జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు.పవన్ సినిమాలలో నటించడం వలనే తాను పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలు గురించి ఇప్పుడు చర్చ జరుగుతూ ఉండగానే పవన్ కళ్యాణ్ మూడో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ వారు పవన్ తో సినిమాని అఫీషియల్ గా ప్రకటించారు.

ఇక ఈ సినిమా పవన్ కి గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉండబోతుందని సమాచారం.వాల్మీకి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఫేంలోకి వచ్చిన హరీష్ పవన్ కోసం మంచి కథని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube