పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసి ప్రస్తుతం అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ పై దృష్టిపెట్టాడు.అదే సమయంలో క్రిష్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు.
అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ షూటింగ్ సెట్ లో ఫిబ్రవరి నుంచి పాల్గొంటాడు.ఇక క్రిష్ మూవీకి సంబంధించి షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైంది.
ఇలా ఒకే సారి రెండు సినిమాలని మొదటి సారి పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో చేస్తున్నాడు.ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలు తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని హరీష్ శంకర్ ఇప్పటికే స్టార్ట్ చేసేశాడు.ఈ సినిమా కూడా గబ్బర్ సింగ్ తరహాలో పోలీస్ కథాంశంతోనే తెరకెక్కబోతుంది.
ఇక ఈ సినిమా కోసం ముందుగా పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకోవాలని హరీష్ శంకర్ ప్లాన్ చేశారు.
అయితే పూజాహెగ్డే హిందీలో వరుసగా మూడు సినిమాలు చేస్తూ ఉండటంతో ఈ ఏడాది మొత్తం ఆమె డేట్స్ అందుబాటులో లేవు.ఈ కారణంగా పూజా హెగ్డే ప్లేస్ లో ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కియారా అద్వానీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే హరీష్ ఆమెని సంప్రదించినట్లు తెలుస్తుంది.
స్టోరీ నేరేట్ చేయడానికి రెడీగా ఉన్నాడని టాక్.కియారా కూడా తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తిగా ఉండటంతో పాటు ఆ సినిమాకి రెమ్యునరేషన్ కూడా గట్టిగా ఇస్తూ ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
త్వరలో దానికి సంబందించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.