సిద్దిపేట ఎమ్మెల్యే, మంత్రి హరీష్ రావు ఎప్పుడు ప్రజల సేవలో ఉంటారని ఆయనకు పేరుంది.కాగా మంత్రిగా మారిన తర్వాత హరీష్ రావు ఎక్కువ సమయాన్ని హైదరాబాద్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
దీంతో సిద్దిపేట నియోజకవర్గం ప్రజలు ఆయనకు తమ విన్నపాలు వినిపించేందుకు తరుచూ హైదరాబాద్ రావాల్సి వస్తోంది.
దీంతో అత్యవసరమైతే తప్ప తననకు కలిసేందుకు వ్యయప్రయాసాలతో హైదరాబాద్కు రావొద్దంటూ తన నియోజకవర్గ ప్రజలకు తెలిపారు హరీష్.
వారంలో నాలుగు రోజులు సిద్దిపేటలోనే ఉంటానని.అక్కడ తనను కలిసి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని హరీష్ కోరారు.
అంత కష్టంమీద ఇక్కడికి వచ్చిన వారి సమస్యలను పరిష్కారం చేయలేకపోతే తాను కూడా అంతే బాధపడతానంటూ ప్రజలు తెలిపారు హరీష్.
ఏదేమైనా ప్రజాసేవలో హరీష్ వంటి వారు ఉన్నంత కాలం ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు వీలుంటుందని నెటిజన్లు హరీష్ను ప్రశంసిస్తున్నారు.
ఈ విషయాన్ని హరీష్ స్వయంగా తన ప్రజలకు చెప్పే విధానం బాగుందని వారు అన్నారు.నిజమైన ప్రజల నాయకుడు అంటే హరీష్ రావు లాగానే ఉండాలని వారు కోరుతున్నారు.