టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి హరీష్ రావు మిగతా నాయకులతో పోలిస్తే మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా కీర్తి గడించారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి కీలక పాత్ర వహించిన హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గానికి మకుటం లేని మహారాజుగా వెలిగిపోతున్నారు.
రికార్డు స్థాయిలో విజయం సాధించిన ఆయన అంతే స్థాయిలో తనదైన పనితీరుతో ప్రజల మనిషిగా గుర్తింపు సాధించారు.కాగా తాజాగా మంత్రి హరీష్ రావుకు భారీ జరిమానా పడింది.
ఇంతకీ మంత్రి హరీష్ రావుకు జరిమానా ఎవరు విధించారు.అసలు ఎందుకు విధించారు అని అనుకుంటున్నారా? మంత్రి హరీష్ రావు తాజాగా దుబ్బాకలో మహిళలకు మెప్మా రుణాలు, చెత్తబుట్టల పంపినీ కార్యక్రమం నిర్వహించారు.దీనికి మంత్రి హరీష్ రావు చాలా ఆలస్యంగా వచ్చారు.ఉదయం 11.30కు రావాల్సిన హరీష్, మధ్యాహ్నం 3.30కు సభాస్థలికి చేరుకున్నారు.
దీంతో చాలాసేపు తమను ఎదురుచేయించినందుకు మన్నించాలని కోరారు హరీష్ రావు.అంతేగాక తనకు జరిమానా విధించాలని మహిళలను కోరారు.దీంతో మహిళలు తమకు మహిళా భవనం కోసం నిధులు కేటాయించాలని మంత్రి హరీష్ రావును కోరగా ఆయన అధికారులతో మాట్లాడి వెంటనే రూ.50 లక్షల నిధులు కేటాయించేలా చర్యలు తీసుకున్నారు.